గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో అసాంఘిక శక్తులను, చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎక్కడ చోటు చేసుకున్నా సి.సి కెమెరాలు ద్వారా పట్టుకోవచ్చు. అయితే గత కొన్ని నెలలుగా పట్టణ పరిధిలో ఎక్కడ కూడా నిఘా నేత్రాలు పని చేయటం లేదు. కారణం సి.సి కెమెరాల కు అవసరం అయిన ఖర్చును పోలీస్ శాఖ భరించలేకపోవటమేనట.
కొన్ని నెలల కొందరు ప్రముఖులు ఆర్థిక సహాయం తో సి.సి కెమెరాలు పని చేసాయి. ప్రస్తుతం మహా శివరాత్రి వస్తున్న నేపధ్యంలో సి.సి కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరం. అయితే పోలీసు శాఖ ఆ పని చేయడంలేదు. స్థానిక బస్టాండ్ వద్ద అధిక శాతం దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు ఒకటి కూడ పని చేయటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణం లో వెంటనే సి.సి కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.