హైదరాబాద్ అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని న్యూ పటేల్ నగర్ లో నూతన సీసీ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికులు కార్పొరేటర్ తో మాట్లాడుతూ డ్రైనేజ్ సమస్య ఉండడంతో నూతన మ్యాన్ హోల్ నిర్మాణం చేపట్టాలని, వెంటనే స్పందించిన కార్పోరేటర్ సంబంధిత అధికారులను పిలిచి వెంటనే నూతన మ్యాన్ హోల్ నిర్మాణం చేపట్టాలని కోరారు.
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రామచందర్ గుప్తా, హరిబాబు, గణేష్, ఈశ్వరమ్మ, పార్టీ సీనియర్ నాయకులు ఆమనూరి సతీష్, మహేష్ ముదిరాజ్, తిరుపతి, చెగురి రఘు బాబు, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట