భారత ఉపరాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి విచ్చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఉప రాష్ట్రపతి కి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ స్వాగతం పలికారు.
ఉప రాష్ట్రపతి కి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రిజిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ భార్గవ, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ కుమార్ ,జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఉన్నారు. ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు కన్నా లక్ష్మి నారాయణ, కామినేని శ్రీనివాసరావు తదితరులు కూడా ఉన్నారు.
ఆదివారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్ట్ర పతి యం.వెంకయ్యనాయుడు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ఆత్కూరు లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో బస చేశారు. సోమవారం మచిలీపట్నం లోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో స్వర్గీయ పిన్నమనేని కోటేశ్వర రావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4.00 గంటలకు అత్కురు లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో నిర్వహించే నాయుడమ్మ వ్యాసాలు, సందేశాలు, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారు.