అన్నమయ్య జిల్లా నందలూరులో తిరుమల ఎక్స్ ప్రెస్, హరిప్రియ ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుదల కు బీజేపీ ఆధ్వర్యంలో అనుమతి రావడంతో గురువారం సంబరాలు చేసుకున్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో పాటూ, టిడిపి,వామపక్షాల ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్లో తిరుమల ఎక్స్ ప్రెస్ కు స్వాగతం పలికారు. రైల్వే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో పాటూ సాయిలోకేశ్,మస్తానయ్య లకు అన్నీ పార్టీల నేతలు ప్రజలు శాలువా గజ మాలతో సన్మానించారు.