ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని 13 ప్రముఖ విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోన్న విమానాశ్రయాల్లోని 13 ఎయిర్పోర్టులను వేలం వేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ప్రాతిపదికన వేలం చేయనున్న 13 విమానాశ్రయాల జాబితాను విమానయాన మంత్రిత్వ శాఖకు పంపినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విమానాశ్రయాల బిడ్డింగ్ను పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రైవేటు సంస్థలకు 50 సంవత్సరాల మేర కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.