31.2 C
Hyderabad
May 3, 2024 02: 16 AM
Slider జాతీయం

లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారుల అరెస్ట్..

cbi

లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్‌ అధికారులను అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన కస్టమ్స్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌, ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ పాల్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం వారిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ధర్మాసనం ఆదేశాలతో వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఓ వ్యక్తిని కస్టమ్స్‌ అధికారులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత నిందితుడు షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే.. బెయిల్‌ రద్దు కాకుండా ఉండేందుకు ఇద్దరు అధికారులు.. నిందితుడిని లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు రూ.20వేలు అడిగారు. అనంతరం రూ.10 వేలకు డీల్ కుదుర్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంరం రూ.10వేలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు.

Related posts

22 పోలీస్ స్టేష‌న్లు…443 కిలోమీట‌ర్లు..విజయనగరం జిల్లాలో దిశ జాగృతియాత్ర‌

Satyam NEWS

జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ కు హానికరం

Satyam NEWS

మసీదుల్లో వారికి మాత్రమే అనుమతి.. సౌదీ ఆదేశాలు జారీ

Sub Editor

Leave a Comment