కాచిగూడ డివిజన్ లోని మోతి మార్కెట్ చౌరస్తాలో నూతన రోడ్డు వేయడానికి రోడ్లని పగలగొట్టి 10 రోజులవుతున్నా పట్టించుకునే దిక్కు కనిపించడం లేదు. రోడ్లు వేయకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న కాచిగూడ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్ తో అక్కడికి వెళ్లి ప్రజలకు అండగా నిలిచారు. జీహెచ్ఎంసీ డి.ఈ సువర్ణ, ఏ.ఈ దివ్యలను పిలిపించి ఈ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాము, నరేష్, కిషోర్, భీమ్ రాజ్, రాము, సంతోష్, చందు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట