జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని….2024 ఎన్నికల లలో ప్రజలే బుద్ది చెబుతారని టీడీపీ విజయనగరం ఇంచార్జ్ ,బుద్ధా వెంకన్న అన్నారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. పుంగనూరు ఘటన పార్వతీపురంలో జరిగితే…తెలుగు తమ్ముళ్లు తడఖా చూపించాలన్నారు.పార్వతీపురంలో చంద్రబాబు పర్యటన ను అడ్డుకుంటే…
వాళ్లకు దబిడిదబిడే అని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. ఇక జగన్ బాబా హయాంలో…147 మంది దొంగల లో కొడాలి నాని ఒకరని ఆరోపించారు… బుద్ధా వెంకన్న. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రమే ఉండేవాడని…టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ తో అసలు పరిచయం లేని వ్యక్తి… నాని అని…ఆయనకు లేని లిక్విర్ ,గంజాయి వ్యాపారం లేదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల పరిశీలనకు తమ పార్టీ అధినేత ఈ నెల ఫస్ట్ నుంచీ శ్రీకారం చుట్టారని అన్నారు. అందులో భాగంగా పార్వతీపురం… వస్తున్నారని…బుద్ధా వెంకన్న తెలిపారు.