చతుర్వేద సరస్వతీ మంత్ర సహిత చండి హోమాన్ని నేడు నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవాలయంలో వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో ప్రతీ మాసం పౌర్ణమి రోజున జరిగే మాసపూజ కూడా నేడు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ రోజు 9:00 గంటలకి గణపతి పూజ, కలశ స్థాపన, రక్ష బంధనం,మండపారాధన, పుణ్య:హావచనం, దీక్ష సంకల్పంతో చండి హోమం ఆరంభం అయింది. ఆలయ స్థానాచార్యులు, వేదపండితులు, పూజరులు భక్తి శ్రద్ధలతో చండి హోమం ప్రారంభించారు.
ఈ చండీ హోమాన్ని ప్రపంచంలో ఉన్న మానవ జాతీ క్షేమం కోసం, ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహించారు. సకల జనులూ సకుటుంబ సపరివారంగా అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని మృత్యుంజయ హోమం, ధన్వంతరీ హోమం, రుద్ర హోమం, శాంతి సూక్త హోమం నిర్వహించారు.