ఘనంగా ఛట్ పూజ కార్యక్రమం హాజరైన బండారి లక్ష్మారెడ్డి, శ్రీదేవి యాదవ్
ప్రాచీన పండుగల్లో ఒకటైన ఛట్ పూజను భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్థించే ఎంతో గొప్ప పండుగ అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. ఆదివారం చర్లపల్లి చెరువు వద్ద బీహార్, జార్ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, చండీగఢ్, గుజరాత్, రాంచీ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా జరుపుకునే ఛట్ పూజ కార్యక్రమం చర్లపల్లి చెరువు దగ్గర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ హాజరైనారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తరలివచ్చిన సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీర్వాదం కావాలని కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ శ్రీదేవీ మాట్లాడుతూ కార్తీకమాసంలో ఛట్ పూజ జరుపుకుంటున్న సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాచీన పండుగల్లో ఒకటైనా ఛట్ పూజను భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్థించే ఎంతో గొప్ప పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అజయ్ కుమార్ సింగ్, రాంవిజయ్ యాదవ్, అంజి షా, ఇంద్రజిత్ సింగ్, కృష్ణసింగ్, జితేందర్ కుమార్, విజయ్ కుమార్, ఉదయ్ కుమార్, డివిజన్ నాయకులు పాల్గోన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా