31.2 C
Hyderabad
May 3, 2024 00: 41 AM
Slider ముఖ్యంశాలు

చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

#telanganajanasamiti

ఈనెల 10వ,తేదీన తెలంగాణ జన సమితి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జరప తలపెట్టిన తెలంగాణా బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం తెలంగాణా బచావో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాల కెసిఆర్ ప్రభుత్వ పాలనలో తెలంగాణా రాష్ట్రం అప్పుల పాలై,అవినీతి మయమైందని అన్నారు.తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలైనాయని, మొత్తం కుటుంబ పాలనతో బ్రష్టుపట్టిందని అన్నారు.ఈ నెల 10వ,తేదీన హైదరాబాద్ నగరంలో జరిగే తెలంగాణా బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహిళా జన సమితి జిల్లా కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మి, యువజన సమితి నేత భిక్షం,పట్టణ పార్టీ కన్వీనర్ మురళి,పుష్ప,విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

హెల్తీ హార్ట్: గుండె జబ్బులు పెరగడానికి కారణాలెన్నో

Satyam NEWS

అక్టోబర్ 2న గాంధీ ఆసుపత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ

Satyam NEWS

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment