31.2 C
Hyderabad
May 3, 2024 00: 02 AM
Slider ఖమ్మం

చీమలపాడు ప్రమాద బాధితులను ఆదుకోవాలి

#chemalapadu

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం కుటుంబంలో ఒక్కరికిప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని క్షత్తగాత్రులకు 50 లక్షలు ఆర్థిక సహకరణ అందించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీమలపాడు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ప్రజాపంథా ప్రతినిధి బృందం మృతులను క్షత్తగాత్రులకు పరిశీలించి వారి కుటుంబ సభ్యులను మాట్లాడి ఓదార్చడం జరిగింది.సంఘటన పూర్వపరాలను కుటుంబ సభ్యులుతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. అనంతరం గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ రాజకీయ కార్యకలాపాల సందర్భంగా హంగు ఆర్భాటాలు ప్రదర్శించి తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని ఆయన అన్నారు. ఆ సంఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన వైద్యానికి అందించాలని డిమాండ్ చేశారు . చీమలపాడుసంఘటనలో నష్టపోయిన వారికి ప్రభుత్వంతో పాటు టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నష్టపరిహారం చెల్లించాలని ఆయన సూచించారు.

Related posts

ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు

Satyam NEWS

ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్: చిన్నారి యధిత్య మరణం బాధాకరం

Satyam NEWS

ఎంపి రఘురామ అరెస్టు అప్రజాస్వామికం

Satyam NEWS

Leave a Comment