వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బృందంపై చెప్పుల దాడి జరిగింది. వైఎస్సార్టీపీ రూపొందించిన మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పరిధిలోని నాగారానికి షర్మిల వెళ్లారు.
ఈ పందర్భంగా షర్మిలను చూసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేవారు. అలాగే పలువురు షర్మిల బృందంపై చెప్పులు విసిరేశారు.