ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామ పరిధిలోని క్రాస్ రోడ్ కు చెందిన బూరం గాంది ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా విషయం తెలుసుకున్న గాంది చిన్ననాటి స్నేహితులు ఆయనతో కలిసి APRS 1995 టు 2001 సంవత్సరం బ్యాచ్ లో చదుకున్న స్నేహితులు గాంధీ కుటుంబ ఆర్థిక అండగా నిలవాలన్నారు.
ఈ క్రమంలో ఈరోజు సోమవారం ఆ బ్యాచ్ లో 33 మంది స్నేహితులు కలిసి 61 వేల రూపాయలు జమచేశారు.
అనంతరం స్థానిక పోస్టాఫీసులో గాంధీ కూతురైన శ్రీ కాంక్ష, అక్షయ పేర్లపై వాటిని ఫిక్స్ డ్ డిపాజి ట్టు చేసి వాటికి సంబంధించిన పేపర్లను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్నేహితులు మల్రాజ్ రాజు , పిట్టల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తమతో పాటు చిన్నప్పుడు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడ్ని గుర్తుంచుకొని ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన ఆ స్నేహితులను పలువురు అభినందించారు.