సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రంలో మహాశివరాత్రి ఐదు రోజుల జాతర సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కబ్బడీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు సంపత్ రెడ్డి, వీరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, జక్కుల వీరయ్య మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. గత 5 సంవత్సరాలుగా శివరాత్రి సందర్భంగా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ యూత్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.శంభులింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగిస్తూ ఉండాలని ఫ్రెండ్స్ యూత్ క్లబ్ కమిటీ వారికి కోరారు.క్రీడాకారులకు ఎల్లప్పుడు తమ యొక్క సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు.
అనంతరం ఫ్రెండ్స్ యూత్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో సంపత్ రెడ్డి,వీరయ్య లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సామర్ల వెంకటరెడ్డి, కమిటీ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.