సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసు అధికారి తగిన మూల్యం చెల్లించాడు. భూమి వివాదంలో తలదూర్చిన యాదగిరిగుట్ట రూరల్ సిఐ నర్సయ్య సస్పెండయ్యారు. సిఐ తన అధికార బలంతో భూ వివాదంలో తలదూర్చారని బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై విచారణ చేసిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ తగిన చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ అయిన నర్సయ్య స్థానంలో ఎల్ బి నగర్ లో సీసీ ఎస్ కు ఎటాచ్ అయి ఉన్న బి.నవీన్ రెడ్డిని యాదిగిరి గుట్టు రూరల్ సిఐ గా నియమించారు. తక్షణమే ఈ నియామకం అమలులోకి వస్తుందని మహేష్ భగవత్ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు.