40.2 C
Hyderabad
May 6, 2024 15: 36 PM
Slider గుంటూరు

భగీరథ ను అభినందించిన చంద్ర బాబు నాయుడు

#chandrababu

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు  ప్రపంచంలోని తెలుగువారందరికీ స్ఫూర్తి ప్రదాతని, ఆయన నిస్వార్థ ,నిరుపమాన ప్రజాసేవకుడని తెలుగు దేశం పార్టీ జాతీయ  అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు చెప్పారు.

ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ తాను రచించిన “మహానటుడు , ప్రజా నాయకుడు -ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని  నారా చంద్ర బాబు నాయుడు కు బహూకరించారు. శుక్రవారం సాయంత్రం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు, నిర్మాత యలమంచిలి అనిల్ బాబు, రామరాజు శ్రీనివాస్ తో కలసి  భగీరథ చంద్ర బాబు నాయుడు ను మంగళగిరి లోని తెలుగు దేశం కార్యాలయంలో కలిశారు.

జర్నలిస్టుగా వారితో వున్న అనుబంధం, వారితో చేసిన ఇంటర్వ్యూలతో ” మహానటుడు , ప్రజానాయకుడు – ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని రచించినట్లు జర్నలిస్టు, రచయిత భగీరథ తెలిపారు. ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా పుస్తకాన్ని విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. భగీరథ చేసిన ప్రయత్నానికి చంద్ర బాబు నాయుడు అభినందించారు. ఇలాంటి పుస్తకాలు భావితరాలకు స్ఫూర్తినిస్తాయని ఆయన అన్నారు.  

శుక్రవారం రోజు  చంద్ర బాబు నాయుడు గారి  సందర్శన కోసం ఎంతో మంది వేచి వున్నా,  తమతో చాలాసేపు ఆత్మీయంగా మాట్లాడినందుకు భగీరథ, రాంబాబు  ఈ సందర్భంగా  చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

సంక్రాంతిలోకా మేడారం జాతర పనులన్నీ పూర్తి చేయాలి

Satyam NEWS

సిఏఏ నిబంధనల రూపకల్పనలో మరింత జాప్యం

Satyam NEWS

లాక్ డౌన్ ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

Satyam NEWS

Leave a Comment