సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న ఆర్ పి లకు గడిచిన ఆరు మాసాల నుండి అలవెన్సులు ఇవ్వకుండా వారితో పని చేయించుకుంటున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు అన్నారు.
మున్సిపాలిటీలో ఏ పని చేయాలన్నా ఆర్ పి లను ఉపయోగిస్తున్నారని, ఇంటింటికి సర్వే మొదలుకొని కరోనా ఇంజెక్షన్లు, బతుకమ్మ చీరలు పంపకం,మొక్కల పంపిణీ,పెంపకం వంటి పనులు చేయించుకుంటూ గత ఆరు నెలలుగా అలవెన్సులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఆర్ పి లు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే వారికి రావలసిన బకాయి చెల్లించి ఇక నుండి ప్రతి నెల వారి అలవెన్సులు ఇవ్వాలని పాలకూరి బాబు డిమాండ్ చేశారు.
నేడు పెరిగిన నిత్యావసర వస్తువులకు ఆర్ పి లకు ఇచ్చే గౌరవ వేతనం 4000 రూపాయలు ఎలా సరిపోతాయి అని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్