కరోనా సమయంలో దేశంలో ప్రభుత్వాలు చేయని పనిని తన దాతృత్వం తో సేవ భావం తో చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న సినిమాల్లో విలన్ గా పేరు తెచ్చుకుని భారత దేశ ప్రజల హృదయాల్లో హీరో గా నిలిచిన నటుడు సోనూసూద్. కరోనా సమయం లో ప్రపంచ వ్యాప్తంగానూ, పాన్ ఇండియా లెవల్లో అనూహ్యమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా అయన ఇటీవలే దేశంలో ఆక్సిజన్ కొరత ఉండగా పేద ప్రజలకు ఆక్సిజన్ అందించారు.
తాజాగా సోమవారంనాడు సినీనటుడు సోనూసూద్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఆయన అందిస్తున్నారు. అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు లేకపోవడంతో శవాలు కుళ్లిపోతున్నాయని సాయం కోసం పలు గ్రామాల సర్పంచులు ఇటీవల సోనూసూద్ సాయం కోసం సంప్రదించారు. దీంతో ఫ్రీజర్ బాక్సులను అందుబాటులోకి తీసుకొస్తామని సోనూసూద్ చెప్పారు.