ఇటీవలే విజయనగరం జిల్లాలో ఎస్ఐల బదిలీలకు శ్రీకారం చుట్టిన పోలీసు శాఖ తాజాగా రేంజ్ పరిధిలో సీఐల బదిలీలకు శ్రీకారం చుట్టారు… రేంజు డీఐజీ హరికృష్ణ. ఇటీవల విజయనగరం జిల్లా వల్లంపూడి స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రేంజ్ డీఐజీ హరికృష్ణ… అప్పుడే సీఐల బదిలీలకు శ్రీకారం చుట్టినట్టు…అలాగే అందుకు సంబంధించిన జాబితా అలాగే రెండేళ్ల పైబడిన వాళ్ళ వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో రేంజ్ పరిస్థితి లో 12 మంది ఇన్ స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఇందులో భాగంగా విజయనగరం వన్ టౌన్ సీఐగా ఉన్న మురళిని..డీసీఆర్బీ కు. అలాగే విజయనగరం డీసీఆర్బీ సీఐగా పని చేస్తున్న సీఐ డా.వెంకటరావును..వన్ టౌన్ కు…అలాగే రూరల్ సీఐ మంగవేణి కి..వీఆర్ గా ఎల్విన్ పేట సీఐ తిరుమతిరుపతి రావును విజయనగరం రూరల్ సీఐగా బదిలీ చేసారు. ఈ మేరకు డీఐజీ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేసారు.