40.2 C
Hyderabad
May 2, 2024 16: 16 PM
Slider రంగారెడ్డి

గాంధీనగర్ డ్రైనేజీ, మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి

#uppal

ఉప్పల్ డివిజన్ లోని గాంధీ నగర్ లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

గాంధీ నగర్ లోని సమస్యలను స్థానికులు ఇటీవల రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో రజితపరమేశ్వర్ రెడ్డి అధికారులతో కలిసి గాంధీ నగర్ లో శనివారం పర్యటించారు.

డ్రైనేజీ, మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని రజితపరమేశ్వర్ రెడ్డి మున్సిపల్, వాటర్ వర్స్క్ అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బకారం లక్ష్మణ్ గారు, తోకట శంకరయ్య, సుక్క జీవన్, సిరివేలు ప్రేమ్ కుమార్, గంజాయి మహేష్, గంజాయి నర్సింగరావు, దర్శనం జంగయ్య, జల్ల రాజు, పోకల శ్రీనివాస్, పలాడి విజయ్, వినోద్, సల్ల ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, కన్నమైన నరేష్, జిత్తు రెడ్డి, బంటి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఢిల్లీలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి ఎల్ జీ?

Satyam NEWS

కొల్లాపూర్ మున్సిపాలిటీ లో పెరిగిన ప్రజాసమస్యలు

Satyam NEWS

ప్ర‌శంసా ప‌త్రం…న‌గ‌దుతో సిబ్బందికి అభినందనలు

Satyam NEWS

Leave a Comment