మునుగోడులో ప్రచారం చివరి దశలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నియోజకవర్గంలో ప్రచారం ముగియనుడటంతో, పార్టీలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో పాల్గొనడానికి వెల్లిన బీజేపీ ఎమ్మెల్యేకు చేధు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో ఈటల కాన్వాయ్ ధ్వంసం కాగా పలువురికి గాయాలు అయ్యాయి. ప్రచారం లో భాగంగా ఈటెల ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో బిజేపి కార్యకర్తలు కూడా రాళ్ళు విసరటంతో కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగూట్టి పరిస్తితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఐతే పోలీసుల వైఖరి పట్ల ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల భార్య జమునా కూడా ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడే వుందటం గమనార్హం.
previous post
next post