37.2 C
Hyderabad
May 6, 2024 19: 24 PM
Slider హైదరాబాద్

సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ మెంబర్ గా అంబర్పేట కార్పొరేటర్

#civil

హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాల    మయాదేవి (ఐఏఎస్) ఆధ్వర్యంలో ఈరోజు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ మెంబర్లుగా నూతనంగా ఎన్నుకోబడిన అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్, వారి తోటి సహచర మెంబర్లతో కలిసి హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషన్ ఆఫీసర్ బాల మాయాదేవి (ఐఏఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం లో లబ్దిదారులకు రేషన్ సక్రమంగా  అందుతుందా లేదా.. పేద ప్రజలకు అందాల్సిన రేషన్ పక్క దారి పట్టకుండా చూడాలని కోరారు. రేషన్ కార్డు కలిగి వున్న వారికి ప్రతి నెల రేషన్ ఇవ్వడం.. రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడకుండా చూసేందుకు నూతనంగా ఎన్నికైన సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ ని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కోరారు. ప్రజల నుంచి ఫిర్యాదు లు అందితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు రేషన్ అందక ఇబ్బంది పడితే విజిలెన్స్ కమిటీ కి ఫిర్యాదు చేసేందుకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశం లో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ రమేష్, సూపరిన్టెండెంట్ సదానంద్, ఏఎస్ఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

బాసరలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

Satyam NEWS

ప్రభుత్వ అస్పత్రులపై నమ్మకం పెంచాలి

Satyam NEWS

కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతయినా వుంది

Satyam NEWS

Leave a Comment