జాతిపిత మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా గాంధీ హాస్పిటల్ ముషీరాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించారు. ఏ సుదర్శన్ శివసేన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధన కార్యదర్శి వినోద్ కుమార్, శేఖర్, శ్రీనివాసులు, మంచాల జ్యోతి మేడం, కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ బాల బాలికలు మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట