ఖమ్మం జిల్లా మధిర మండలం, సిరిపురం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వాలంటీర్లకు కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క మాస్కులు పంపిణీ చేశారు. మాస్కులను అందించే సమయంలో డెటాల్ తో శుభ్రం చేసి మరీ ఆయన అందరికి అందచేశారు.
మృత్యువిహారం చేస్తున్న కరోనాని నియంత్రిచడంలో భాగంగా పోలీసులు కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని ఆర్యోగ్యాన్ని కాపాడుకోవాలని పోలీసులకు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క సూచించారు.