సీఎం జగన్ మోహన్ రెడ్డి తను చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల పేద, మధ్యతరగతి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. 12వ డివిజన్లోని చింతా రెడ్డిపాలెంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గడపగడప కార్యక్రమంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు సాదరంగా స్వాగతం పలికి, చిరునవ్వులతో ఆహ్వానిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.
మమ్మల్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాల వల్ల వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఎనలేని కీర్తి దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాల కంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తన ఖ్యాతిని పెంచుకున్నారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, మొబీనా, వైసిపి నేతలు సుబ్బారెడ్డి, పాశం శ్రీనివాసులు, హరిబాబు యాదవ్, యేసు నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, రామ శివారెడ్డి, శివ సునీల్ రెడ్డి, సూరిబాబు, పుల్లారెడ్డి, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వైసిపి సేవాదళ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.