కడప జిల్లా మూడు రోజుల పర్యటనలోసీఎం వైఎస్ జగన్ ప్రసంగం లో జోష్ తగ్గిందా అని పలువురు చర్చించుకుంటున్నారు. అసలు ముఖ్యమంత్రి ప్రసంగం మొత్తం ఏదో పాఠం అప్పజెప్పినట్లు ఉందే తప్ప అది ఒక ప్రసంగoలా లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
ముఖ్యమంత్రి ప్రసంగం ఎంతో ఉత్సాహంగా సాగేది ..ఎందుకనో ఈ దఫా ఆయన ప్రసంగంలో జోష్ కనిపించలేదు . రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా ఆయన ప్రసంగం కొనసాగడం విశేషం. ప్రతిపక్షాల పైన విమర్శలు కానీ లేదా ఉత్సాహపరిచే విధంగా మాటలు కానీ లేనట్లు పలువురు పేర్కొంటున్నారు..