విజయనగరం జిల్లా కలెక్టర్, ఎస్పీలు… ఇద్దరూ నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.ఈ నెల 13న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే పోలింగు కేంద్రాలైన కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్, ఎం.ఆర్.ఎ. కళాశాల, కస్పా స్కూల్ మరియు సంస్కృత పాఠశాలలను జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి, మరియు జిల్లా ఎస్పీ ఎం.దీపిక, సంయుక్తంగా సందర్శించి, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలు గురించి, భద్రత ఏర్పాట్లు గురించి పోలీసు మరియు రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ ఎస్పీ ల వెంట విజయనగరం డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు, 2వ పట్టణ సిఐ సిహేచ్.లక్ష్మణరావు, ఎస్బి సిఐ జి.రాంబాబు, తహిసీల్దార్ మరియు ఇతర రెవెన్యూ మరియు పోలీసు అధికార్లు, సిబ్బంది పాల్గొన్నారు.
next post