32.7 C
Hyderabad
April 26, 2024 23: 18 PM
Slider మహబూబ్ నగర్

నాజా జిల్లా అధ్యక్షుడు మందడి చిరంజీవిని సన్మానించిన పెబ్బేరు విలేఖరులు

#pebberu

వనపర్తి జిల్లా నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పెబ్బేరు మండలానికి చెందిన మందడి చిరంజీవి ఎన్నిక కావడంపై పెబ్బేరు మండల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తోటి జర్నలిస్టులు మాట్లాడుతూ…గత కొన్ని సంవత్సరాలుగా మాతో పాటుగా పాత్రికేయుడిగా పని చేస్తూ సమాజంలో జరుగుతున్న పలు సమస్యలపై పత్రికలలో ప్రచురిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలువురి ప్రశంసలు పొందారు.

తాను చేసే పత్రిక వృత్తికి న్యాయం చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మారిన మందడి చిరంజీవి సేవలను గుర్తించి పాత్రికేయ సంఘంలో తనదైన గుర్తింపుగా నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ జిల్లా అధ్యక్ష హోదా ఇవ్వడం మేము హర్షిస్తున్నామని సీనియర్ జర్నలిస్టులు ఆంజనేయులు,కేతేపల్లి రాజు,బాలవర్ధన్,బాషా,ఈశ్వర్ సేవలను కొనియాడారు. అంతేకాకుండా ఆయా రాజకీయ పార్టీల నాయకులు మందడి చిరంజీవి ఎన్నిక పట్ల అభినందనలు తెలిపారు.

Related posts

వన్యప్రాణుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు

Satyam NEWS

అనారోగ్య బాధితుడికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ

Satyam NEWS

తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్

Satyam NEWS

Leave a Comment