బుధవారం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగ్ అంబర్ పేట డివిజన్ సీఈ కాలనీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ వీధి దీపాలు వెలగడం లేదని, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయడం లేదని, కాలనీలో వాహనాలు వేగంగా వెళ్లడాన్ని నిరోధించడానికి స్పీడ్ బ్రేకర్లు కావాలని, ప్రస్తుతం వర్షాల వలన నీరు నిలిచి ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఎమ్మెల్యేకి తెలిపారు. అలాగే కాలనీలోని పార్క్ ను అభివృద్ధి చేయాలని, కాలనీలోకి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయడం లేదా వేరే బస్సుల రూటు మార్చి ప్రయాణం సులభతరం చేయాలని, వారు ఎమ్మెల్యేని కోరారు. ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే కాలనీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్