ఏఐసీసీ పిసిసి పిలుపుమేరకు తాండ్ర గ్రామంలోహాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని తాండ్ర గ్రామంలో కాయతి విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయతి విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూదేశ చరిత్రలో ఎన్నడు లేనటువంటి ఎప్పుడు చూడని కనివిని ఎరగని విధంగా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయేటటువంటి యాత్ర అని కొనీయాడారు.
దేశంలో విభజించి పాలించే ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరితో ప్రేమ స్నేహపూర్వకంగా కలిసిమెలిసి జీవించి దేశ ప్రజలందరం ఏకతాటిపై నడవాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని దేశ ప్రజలకు తెలియజేసేలా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర ద్వారా ప్రతి వీధికి ప్రతి ఇంటికి ప్రతి గడపకి తాండ్ర గ్రామంలో అవగాహన కల్పించామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కల్వకుర్తి మండల ప్రధాన కార్యదర్శి బండి సుదర్శన్, ముత్యాలు, వెంకటయ్య, వెంకటయ్య అల్లాజి, శేఖర్, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు హరీష్ యాదవ్ సందీప్, మల్లేష్, శివ,అంజి,అరుణ్, నందు, ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.