భారత ప్రధానిగా నరేంద్రమోడీ రెండో సారి ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంగా బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో నేడు ఆయన పేద గ్రామీణులకు కరోనా కిట్ లను కూడా పంపిణీ చేశారు.
దేశం మొత్తంలో లక్ష గ్రామాలలో సేవహీ సంఘటన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కుమ్మరి శంకర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 5000 గ్రామాలలో ఈ కార్యక్రమం జరగాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని 10 గ్రామాలలో కరోనా పేషెంట్లకు నిత్యావసర వస్తువులు, మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.