27.7 C
Hyderabad
May 12, 2024 06: 38 AM
Slider ముఖ్యంశాలు

దేశానికే గర్వకారణంగా కమాండ్ కంట్రోల్

కమాండ్ కంట్రోల్ దేశానికే మణిహారం గా నిల్వనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, DGP మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైద్రాబాద్ సిపి సివి ఆనంద్ లతో కలిసి సందర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ
అత్యాధునిక టెక్నాలజీ తో సుమారు 600కోట్ల రూపాయల వ్యయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ ను నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ నెల 4 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. దేశం లో ఎక్కడ లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

జర్మనీ,ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీ ని ఉపయోగించడం జరుగుతుందని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

DGP, హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాల నుండి కూడా శాంతిభద్రతల ను పర్యవేక్షించడం జరుగుతుందని వివరించారు. ఇక్కడి నుండి తక్షణం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయబడతాయని చెప్పారు. రానున్న రోజులలో కమాండ్ కంట్రోల్ మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆదర్శనీయం కానున్నదని అన్నారు.

Related posts

మంగళ్ హాట్ లో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

Satyam NEWS

ఆదిలాబాద్ మున్సిపాలిటీ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam NEWS

రామతీర్థం నీలాచలం కేసులో ముగ్గురి అరెస్టు

Satyam NEWS

Leave a Comment