స్వర్గీయ ఎన్ టి రామారావు నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో ఉమామహేశ్వరి పార్దీవ దేహం పై పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు.
ఉమా మహేశ్వరి అంటే నందమూరి తారకరామారావు గారికి అధిక ప్రేమ అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఉమా మహేశ్వరి అకాల మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి తలసాని అన్నారు.