బయటకు వెళ్లే టప్పుడు మనల్ని నమ్ముకున్న వారి గురించి ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని… విజయనగరం జిల్లా ఓఎస్డీ (ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఏఏస్పీ సూర్యనారాయణరాజు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బ్యారెక్స లో ఏఆర్ కానిస్టేబుల్ రమణరాజు సంతాప సభ జరిగింది.
ఈ నెల 27 న నగరంలోని సీతం కాలేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓఎస్డీ సూర్యనారాయణరాజు గన్ మెన్ రమణరాజు, సీతం కాలేజీ అధ్యాపకుడు దుర్మరణం చెందారు. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఓఎస్డీ, ఏఆర్ డీఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లారు కూడ. అంతకు ముందు రోజే సెలవుపై వెళ్లి వచ్చిన ఎస్పీ రాజకుమారికి..విషయం తెలిసిన వెంటనే.. ఘటనా స్థలానికి వెళ్లి కానిస్టేబుల్ భార్యను ఓదార్చారు కూడ.
ఆ సమయంలో భార్య తో పాటు ఎస్పీ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. ఉన్న పళంగా కానిస్టేబుళ్ రమణరాజు దహన కార్యక్రమాలకు…ఉన్నతాధికారులు తమ వంతు తక్షణ సాయం కూడా అందించారు.ఇక జిల్లా పోలీస్ శాఖ అందునా ఏఆర్,ఎస్టీఎఫ్, సంయుక్తంగా బ్యారెక్స్ లో రమణ రాజు సంతాప నిర్వహించారు.
తొలుత రమణ రాజు ఫోటోకు పూలదండ వేసి జ్యోతులు వెలిగించి యావత్ ఏఆర్ సిబ్బంది అంతా మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కు సెల్యూట్ చేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఓఎస్డీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ…తన అంగరక్షకుడైన రమణరాజు ఎప్పుడు నిజాయితీ…ఉన్నతాధికారులను గౌరవించడం…తూచ తప్పకుండా విధులు నిర్వహించేవాడన్నారు.
కొన్ని సభలు..కార్యక్రమాలలో…తాను కూర్చొన్నప్పుడు గన్ మెన్ ను కూర్చొమన్నా…ఎప్పుడూ డ్యూటీతో ఉండేవాడన్నారు.ఇటీవలే డీజీ పర్యటన సందర్భంలో కూడా…..గన్ మెన్ రమణరాజు ను కూర్చొవయ్యా అని చివరకు గట్టిగా అనడంతో కూర్చున్నాడని…అనుభవాలను ఎస్పీడీ ఈ సందర్బంగా తెలిపారు.
తన 32 ఏళ్ల సర్వీసులో ఎంతో మంది గన్ మెన్ లను చూసానని కాని రమణరాజు లాంటి అంగరక్షకుడును చూడలేదన్నారు. అంతకుమందు ఏఆర్ డీఎస్పీ శేషాద్రి మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరికి తనదొక విన్నపమని… ఉంటే డ్యూటీ ఉండాలని లేదంటే కుటుంబంతో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ సీఐ రాంబాబు… ఏఆర్ ఇన్ స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.