టీ కాంగ్రెస్ఎలక్షన్ప్లాన్షురూ చేసింది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అయింది. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మార్కులు పొందేందుకు స్కెచ్ వేసింది. ఫస్ట్రౌండ్ లో భూ దోపిడీలపై ఆధారాలతో సీరియల్ గా బయటపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వద్ద తక్కువ ధరకు భూములు తీసుకున్న సంస్థలను టార్గెట్ చేసింది. భూ దోపిడీలు జరిగినట్లు స్వయంగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రెండు ఎపిసోడ్లలో ప్రకటించారు. హెటిరో, యశోదా ఆస్పత్రులు సర్కార్ ఆదాయానికి గండి కొట్టినట్టు వివరించారు.
డైలీ ఒక భూ దోపిడీని ప్రకటిస్తానని రేవంత్ పేర్కొన్నారు. భూ స్కామ్ల సీరిస్పూర్తికాగానే సర్కార్స్కీమ్ లు, డెవలప్మెంట్ యాక్టివిటీస్తప్పిదాలను ఇలా కాంగ్రెస్ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో పాటు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కట్టిన ప్రాజెక్టులపై కూడా పార్టీ పూర్తిస్థాయిలో ఫోకస్పెట్టింది. ఇప్పటికే ఇంటర్నల్ కమిటీతో రేవంత్ డేటా సేకరించే పనిలో బిజీ అయ్యారు. ఆయా కమిటీల్లో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్లు కాంగ్రెస్కు చెందిన ఓ కీలక నేత తెలిపారు.
కేసీఆర్ సర్కార్ తప్పిదాలను టీ కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ఓటమికి ఇప్పటినుంచే కాంగ్రెస్శ్రమిస్తుంది. ఇందుకు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ తప్పులను గుర్తించి ప్రజల ముందు పెట్టనుంది. సోషల్మీడియా ద్వారా పబ్లిక్డొమైన్ లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక సోషల్మీడియా కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇటీవలే సోషల్మీడియా వింగ్లు ట్రైనింగ్ కూడా పొందినట్లు కాంగ్రెస్నేతలు చెప్పారు. ప్రజలకు త్వరగా అర్థమయ్యే విధానాలను అవలంభించనున్నట్టు పేర్కొన్నారు. ఇంటింటికి కాంగ్రెస్కేడర్తిరగనుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సర్కార్భూ స్కామ్లు, స్కీమ్ల్లో దోపిడీల వంటి వాటిపై చార్జ్ షీట్ గా ప్రచారం చేయనుంది. చౌరస్తాల్లో భారీస్థాయిలో హోర్డింగ్లు, ప్రచార పత్రాలను ఏర్పాటు చేయనుంది. వచ్చే రెండు మూడు నెలల్లో రాష్ట్రమంతటా సర్కార్ తప్పిదాలు, స్కామ్ లను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ తీర్మానించింది.
ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం పరిపాటిగా మారిందని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. దీంతో కాంగ్రెస్అన్ని ఆధారాలతో సర్కార్ తప్పిదాలను బయటపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్షన్ప్లాన్ను అమలుకు పూనుకుంది. ఈడీ, సీబీఐ, సిట్లాంటి దర్యాప్తు సంస్థలకు కూడా బీఆర్ఎస్ప్రభుత్వ తప్పిదాలపై కంప్లైంట్ చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు రేవంత్ రెడ్డి లేఖలు రాస్తానని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో సర్కార్ తప్పిదాలు, స్కామ్ల కాపీలను కూడా లేఖలో జత చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో 75 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ తన పోరును తీవ్రం చేసిందనే చర్చ గాంధీభవన్లో జోరుగా నడుస్తుంది.