మహిళ దారుణ హత్య కలకలం రేపింది. సికింద్రాబాద్ మహంకాళి పీఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. యాచకురాలిపై రాయితో దాడి చేసి మరో యాచకుడు హత్య చేశాడు.
మద్యం మత్తులో అర్ధరాత్రి యాచకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.