కరోనా లాక్డౌన్ సమయంలో కే.సీ.ఆర్ ప్రభుత్వం పెంచిన అధిక విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులందరూ నల్ల జెండా, నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసనలో పాల్గొనాలని పిసిసి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
జూలై 6 మధ్యాహ్నం 12 గంటలకు అన్ని పట్టణం/మండల విద్యుత్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరసనలు తెలపాలని ఆయన కోరారు. అన్ని చిన్న వ్యాపారస్తులకు, బిపిఎల్ కుటుంబాలను లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల నుండి మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని బిల్లింగ్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్లుగా టెలిస్కోపిక్ పద్ధతిలో చేయాలని ఆయన కోరారు.