దళితులు లాభదాయకమైన యూనిట్లు ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం కొడవటిమెట్ట గ్రామంలో పర్యటించి, దళితబంధు సర్వే తనిఖీ చేశారు. గ్రామంలోని తిరుమలపల్లి జోజి, మేకల రవికుమార్ ల ఇండ్లకు వెళ్లి వారితో ఇంటరాక్ట్ అయ్యారు. ఏమి పనిచేస్తున్నది, ఏ యూనిట్ గురించి ఆలోచిస్తుంది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం దళితులు ఆర్థికంగా ఎదిగి, తమ కాళ్ళ మీద తాము నిలబడడమే కాక, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలన్నారు. లబ్ధిదారులకు కావాల్సిన ధ్రువీకరణలు ప్రత్యేక మీ సేవ కేంద్రాలు ఏర్పాటుచేసి అందజేస్తామన్నారు. మనం ఏ వృత్తిలో వున్నాం, ఏ వృత్తిలో నైపుణ్యం ఉంది, ఏ యూనిట్ అయితే మన కుటుంబ సభ్యులే నిర్వహించుకోగల్గుతాం, ఏ యూనిట్లకు డిమాండ్ ఉంది అనే ఆలోచన చేయాలన్నారు. కాలనీల్లో, వీధుల్లో దళితబంధు యూనిట్లపై చర్చ జరగాలన్నారు.
previous post
next post