38.2 C
Hyderabad
May 3, 2024 19: 35 PM
Slider జాతీయం

యూపీఏ లేదన్న మమతాకు కాంగ్రెస్ గట్టి కౌంటర్

mamata-banerjee-1

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లేదని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ లేకుండా భారతీయ జనతా పార్టీని ఓడించడం కేవలం కల మాత్రమే అని కేసీ వేణుగోపాల్ అన్నారు.

 ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు శరద్ పవార్‌తో ఆమె సమావేశమైన తర్వాత, “ఇప్పుడు యుపీఏ లేదు” అని ఆమె తేల్చి చెప్పినట్లు తెలిసింది. “కాంగ్రెస్ బెంగాల్‌లో పోటీ చేస్తుంటే, నేను గోవాలో ఎందుకు చేయలేను?” అని ముంబైలో విపక్ష నేతల సమావేశంలో మమతా బెనర్జీ అన్నారు.

ఇదిలావుండగా, శరద్ పవార్‌ను ఇరుకున పెట్టేందుకు బెనర్జీ కుట్ర పన్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. శరద్ పవార్‌తో పాటు ఇతర పార్టీల వ్యక్తులను ఇరుకున పెట్టి బీజేపీకి ప్రత్యామ్నాయం చూపేందుకు మమతా బెనర్జీ ముందస్తుగా పన్నిన కుట్ర. ఇది బీజేపీకి అత్యంత లాభిస్తోందని అధిర్ రంజన్ అభిప్రాయపడ్డారు.

Related posts

చలో ఖమ్మం జయప్రదం చేయండి: టి ఎన్ టి యు సి

Satyam NEWS

హుజుర్ నగర్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

Satyam NEWS

అవనికి ప్రతిరూపం

Satyam NEWS

Leave a Comment