సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 18, 19వ, వార్డులలో DMFT నిధుల ద్వారా మంజూరు అయిన నిధులతో CC రోడ్ల నిర్మాణానికి శంఖు స్థాపన కార్యక్రమంలో ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
18 వార్డు కౌన్సిలర్ కుంట ఉపేంద్ర సైదులు ఆర్థిక సహాయంతో వికలాంగుల కొరకు మూడు చక్రాల సైకిళ్ళను అందజేశారు. 18వ వార్డులో ఏర్పాటు చేసిన MLC పట్టభద్రుల ఓటర్ నమోదు కేంద్రంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి రవి అర్చన, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వర రావు,మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమరనాధ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, 18,19 వార్డు కౌన్సిలర్లు కుంట ఉపేంద్ర సైదులు, మంజుల హరిబాబు, ఇతర వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.