కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్ అయిన కటకం మృత్యుంజయం ఆఖరికి ఆ పార్టీ వీడారు. కాంగ్రెస్ పార్టీ వీడడమే కాకుండా ఆ పార్టీకి బద్ధ శత్రువు అయిన బిజెపిలో చేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు గా దశాబ్దకాలం పైగా పని చేసిన మృత్యుంజయం ఇప్పుడు ఈ వయసులో పార్టీ ఎందుకు మారారో అర్ధం కాలేదు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయుడుగా ఉండేవారు.
పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతో మందికి మార్గదర్శనం చేసిన మృత్యుంజయం ఇప్పుడు బిజెపిలో చేరి కొత్తగా అన్ని విషయాలూ నేర్చుకోవాల్సి ఉంటుంది. కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మృత్యుంజయంను పార్టీలోకి ఆహ్వానించారు.