సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మ గాంధీ 152వ, జయంతి,లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని శనివారం గాంధిపార్క్ సెంటర్ నందు గాంధీ మహాత్మునికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భముగా మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి మాట్లాడుతూ అహింస,సత్యమార్గంలో స్వాతంత్రం సమపార్జించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.ఆయన సూచించిన మార్గం ప్రపంచ దేశాలకే ఆదర్శం అన్నారు.ఆయన మార్గంలో పయనించిన మహానీయుడు లాల్ బహదూర్ శాస్త్రి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఓరుగంటి నర్సింహారావు,సెక్రటరీ పొలిశెట్టి నర్సింహారావు,వంగవేటి హనుమంతరావు, వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, వీర్లపాటి గాయత్రి భాస్కర్,గజ్జి ప్రభాకర్, మాశెట్టి ఆనంతరాములు,ఓరుగంటి మట్టయ్య,ఉప్పాల శ్రీహరి,ఓరుగంటి నర్సయ్య,ఆనంతరాములు,సింగిరికొండ శ్రీనివాస్, మట్టపల్లి వెంకటనారాయణ, దాసా నాగేశ్వరరావు,బొడ్డు రమేష్,తమ్మన సుజాత,ఆరేటి వెంకటలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్