32.2 C
Hyderabad
May 1, 2024 23: 08 PM
Slider నల్గొండ

ఎన్నికల హామీ ప్రకారం హుజూర్ నగర్ కు నిధుల విడుదల

MLA Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి భారీగా నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డికి శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కృతజ్ఞతలు తెలియచేశారు. హుజుర్ నగర్ ఉప ఎన్నిక అనంతరం కృతజ్ఞత సభలో వరాలు జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి 15 కోట్లు, మండల కేంద్రం అయిన మేజర్ గ్రామ పంచాయతీలకు 30 లక్షలు చొప్పున మొత్తం కోటి 50 లక్షల రూపాయలు, 134 గ్రామ పంచాయతీలకు గాను గ్రామ పంచాయతీకి 20 లక్షల చొప్పున మొత్తం 26 కోట్ల 80 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

అదే విధంగా గిరిజన సోదరులకు ఇచ్చిన మాట ప్రకారం ట్రైబల్ స్కూల్ కి 28 కోట్ల 57 లక్షలు, బంజారా భవన నిర్మాణానికి 1 కోటి 50 లక్షల రూపాయల నిధులు అభివృద్ధి, సంక్షేమానికి మంజూరు చేసి అనుమతులు ఇచ్చి వెంటనే పనులకు సిద్దంగా ఉన్నాయని హుజూర్ నగర్ శాసనసభ సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

క్లీన్ ప్రెమిసిస్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Satyam NEWS

ప్రధానోపాధ్యాయుని హత్య

Bhavani

సీఆర్‌డీఏ పరిధిలో అభివృద్ధి ప్రణాళికల్లో సవరణలు

Satyam NEWS

Leave a Comment