శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ ఏ.రేవంత్రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. అది ప్రమాదం కాదేమోనని, కుట్ర జరిగినట్లు అనుమానంగా ఉందని అన్నారు.
తాజా పరిణామం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతోందేమోనని అనుమానంగా ఉందని రేవంత్ అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జల దోపిడీకి సహకరించి రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందు నుంచి తాము చెబుతూనే ఉన్నామన్నారు.
ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.