శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం శ్రీకాకుళం మండలం విద్యాశాఖ అధికారి జీ. కృష్ణారావు నాడు నేడు పనులను పర్యవేక్షించారు.
అనంతరం ఆయన విద్యార్థులకు ధర్మల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో అందరికీ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు.
తదుపరి మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కూడా ఆయన సంతృప్తి చెందారు. ప్రస్తుత శీతాకాలంలో కరోనా ప్రబలే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
విద్యార్థులు అందరూ రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కూలు ధరించాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు, పెద్దపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.