జోరుగా ఎన్నికల ప్రచారం… ప్రజల నుంచి విశేష స్పందన
బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి పోయి కాంగ్రెస్ పక్షాన నిలుస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్దినీ బారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో మందముల పరమేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాప్రా సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్,మర్రిగుడెం,కేబుల్ కాలనిలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తొలి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రానున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
అధికారం చేపట్టిన బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి పోయి కాంగ్రెస్ పక్షన నిలుస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్దినీ బారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లం శ్రీనివాస్, నెమలి అనీల్, కాంగ్రెస పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.