సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని హాస్పిటల్ లో ‘బి’ నెగిటివ్ రక్తం అత్యవసరంగా కావాలని వల్లపుదాసు కృష్ణ జనచైతన్య ట్రస్ట్ ను సంప్రదించగా ట్రస్ట్ నిర్వాహకులు పినపారాళ్ళ వంశీ,పారా సాయి,శివశంకర్ లు తక్షణమే స్పందించి డోనార్స్ తో మాట్లాడి పంపిస్తామని హామీ ఇచ్చారు.
ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ళ వంశీ స్పందించి సూర్యాపేట లో ఉన్న మిత్రుడు జమీల్ తో మాట్లాడి కోదాడ బ్లడ్ బ్యాంక్ వద్దకు పంపి ‘బి’ నెగిటివ్ బ్లడ్ రక్తదానం చేయించారు.జనచైతన్య ట్రస్ట్ తరుపున రక్తదానం చేసిన జమీల్ ని ట్రస్ట్ సభ్యులు అభినందించారు.
ఈ సందర్బంగా ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ళ వంశీ మాట్లాడుతూ రక్తం అవసరం వున్నా ప్రతి ఒక్కరికి జన చైతన్య ట్రస్ట్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని తెలుపుతూ,ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్