నిఖార్సైన కార్యకర్తను కోల్పోయామని విజయ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తుర్కల పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మయ్య ఆదివారం చనిపోవడంతో ఆయన పార్ధివ దేహానికి కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన కార్యకర్తను కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మయ్య ఆరోగ్యం దెబ్బతినడంతో నేడు చనిపోయినట్టు తెలిపారు. లక్ష్మయ్య చనిపోవడం చాలా బాధాకరమని అయన ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ అందించారని పరమపదించడంతో పార్టీకి చాలా లోటూ ఏర్పడుతుందని తెలిపారు. అదేవిధంగా తర్నికల్ సర్పంచ్ పాండు మావిళ్ళపల్లి వంశీ తురకలపల్లి మాజీ ఉపసర్పంచ్ విజేందర్ రెడ్డి తుర్కపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు వెంకటయ్య గౌడ్, లక్ష్మయ్య ,సైదులు, ఆంజనేయులు ,బాబు, పరశురాములు, ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.