తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఖమ్మం జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డా.భాగం కిషన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. 13 మంది సభ్యులుండే రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. కిషన్ రావు సిద్దార్ధ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఖమ్మం మమత కళాశాలలో ఎండి అనస్తీషియా చేశారు.
ఖమ్మం మమత జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేసిన కిషన్ రావు ప్రస్తుతం అదే కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కిషన్ రావు విస్తృతంగా హెల్త్ క్యాంపులు, ప్రత్యేకించి వివిధ విభాగాల ప్రత్యేక నిపుణులతో క్యాంపులు నిర్వహించారు. ఆయనను యూనైటెడ్ ప్రోగ్రెసివ్ : ఫోరం, తానా ఐఎంఏ, ఐఎస్ఎస్ఐ ప్రభుత్వ వైద్యుల సంఘం బలపరుస్తున్నాయి.